ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

May 31 2025 6:56 AM | Updated on May 31 2025 6:56 AM

ఆరోగ్

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

మెదక్‌ మున్సిపాలిటీ: ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంతో సంతోషంగా గడపాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఉద్యోగ విరమణ పొందుతున్న ఆర్‌ఎస్‌ఐ యశ్వంత్‌రావును శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సన్మానించి పోలీస్‌ వ్యవస్థకు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్‌, ఏఆర్‌ డీఎస్పీ రంగానాయక్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

పెద్దశంకరంపేట(మెదక్‌): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట, ముసాపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు సంబంధించి భూమి పూజలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే సొంతింటి కల నెరువేరుతుందన్నారు. అన్నివర్గాలకు సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లబ్ధిదారులకు బిల్లులు వెంటవెంటనే వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ షాకీర్‌అలీ, నాయకులు సంతోష్‌, అంజిరెడ్డి, బక్కారెడ్డి, సాయిరెడ్డి, శశిధర్‌రెడ్డి, సంగమేశ్వర్‌, రోమాల సాయిలు, గోవింద్‌రావు, విఠల్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

వెల్దుర్తి(తూప్రాన్‌): గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు ఎస్జీఆర్‌ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్‌లో జూన్‌ 15 నుంచి ఉచిత ఉద్యోగ శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్ట్‌ ఎండీ మధు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణ సమయంలో భోజన వసతి, హాస్టల్‌ సౌకర్యం ఉచితంగా అందించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు జూన్‌ 15లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9441348569, 7287080612 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

నకిలీ విత్తనాలు

అమ్మితే కఠిన చర్యలు

చేగుంట(తూప్రాన్‌): నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవ సాయ అధికారి వినయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం చేగుంటలోని పలు ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేశారు. రికార్డులతో పాటు విత్తనాలను పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని నిర్వాహకులను ఆదేశించారు. స్టాక్‌కు సంబంధించిన రికార్డులను ఖచ్చితంగా రాయాలని సూచించారు. వానాకాలం సీజన్‌లో నిత్యం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దుకాణాలను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలను

పర్యవేక్షించాలి: డీడబ్ల్యూఓ

నర్సాపూర్‌: అంగన్‌వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని డీడబ్ల్యూఓ హైమావతి ఆదేశించారు. శుక్రవారం నర్సాపూర్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టులోని సూపర్‌వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోషణలోపంతో ఉన్న పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు పిల్లల ఎదుగుదల స్థితిని వివరించాలని సూచించారు. బాల్య వివాహాలు జరగకుండా ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేయాలన్నారు. అనంతరం పట్టణంలోని రీహాబిలిటేషన్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఆమె వెంట సీడీపీఓ హేమాభార్గవి పలువురు సూపర్‌వైజర్లు ఉన్నారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి 
1
1/2

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి 
2
2/2

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement