శాంతియుతంగా పండగలు జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శాంతియుతంగా పండగలు జరుపుకోవాలి

Jun 3 2025 6:58 AM | Updated on Jun 3 2025 6:58 AM

శాంతి

శాంతియుతంగా పండగలు జరుపుకోవాలి

తూప్రాన్‌: కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని డీఎస్పీ నరేందర్‌గౌడ్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని లింగారెడ్డి గార్డెన్‌లో తూప్రాన్‌ పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని శివ్వంపేట, మనోహరాబాద్‌, వెల్దుర్తి, తూప్రాన్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ప్రముఖులతో పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిమతాలకు చెందిన పండగలను గౌరవించాలని సూచించారు. సోదరభావంతో కులమతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉండాలని తెలిపారు. అలాగే సోషల్‌ మీడియాలో వచ్చే విషయాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐలు, ప్రజలు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో మిల్లెట్‌ క్యాంటీన్‌

మెదక్‌ కలెక్టరేట్‌: కలెక్టరేట్‌లో సోమవారం ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో మిల్లెట్‌ క్యాంటీన్‌ ఏర్పాటు చేశారు. 12 రకాల మిల్లెట్లతో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఉలవలు, జొన్నలు, రాగుల, అవస, ఇప్ప పువ్వు లడ్డులు, మునగాకు పౌడర్‌, కొర్రలు, అవసగింజలు, జొన్న ఉప్మా, ఊదలతో పొంగలి తదితర ఆహార పదార్థాలు లభించనున్నాయి. కేవలం రూ. 50కే ప్లేట్‌ విక్రయిస్తున్నట్లు ప్రతి సోమవారం క్యాంటీన్‌ ఉంటుందని పెద్దశంకరంపేట మండలానికి చెందిన ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు అనిత తెలిపారు.

అమరవీరులకు నివాళి

చిన్నశంకరంపేట(మెదక్‌): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి నివాళులర్పించారు. ఈసందర్భంగా అమరుల త్యాగాలను కొనియాడారు. ఆమె వెంట బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, నాయకులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ సత్యనారాయణగౌడ్‌ ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సాన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ అరుణ, శ్రీమన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, శివకుమార్‌ తదితరులు నివాళులర్పించారు.

హామీలు అమలు చేయాలి

పాపన్నపేట(మెదక్‌): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చి న హామీలను వెంటనే నెరవేర్చాలని టీజీ సీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంగ నర్సింలు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే పీఆర్సీ ఇస్తామని, పెండింగ్‌ డీఏలు విడుదల చేస్తామని, హెల్త్‌కార్డులు ఇస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయడంతో పాటు పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. లేకుంటే ఉద్యమాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు.

లక్ష్మణ్‌ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి

సదాశివపేట(సంగారెడ్డి): ఆచార్యా కొండా లక్ష్మణ్‌ బాపూజీని ప్రభుత్వం తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని పద్మశాలి సేవా సంఘం డిమాండ్‌ చేసింది. సోమవారం సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ సరస్వతికి వినతి పత్రం అందజేశారు. మలిదళ పోరాటానికి లక్ష్మణ్‌ బాపూజీ స్ఫూర్తి ప్రదాత అని సంఘం అధ్యక్షులు మేకల జనార్ధన్‌, గౌరవ అధ్యక్షుడు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి మల్లేశం కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేశారని, అందుకే ఆయనకు జాతిపిత ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో చింత చంద్రశేఖర్‌, కోట రవీందర్‌, ఆనంద్‌కుమార్‌, వెంకటేశం, రవి పాల్గొన్నారు.

శాంతియుతంగా పండగలు జరుపుకోవాలి 
1
1/1

శాంతియుతంగా పండగలు జరుపుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement