హామీల అమలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

Jun 4 2025 8:33 AM | Updated on Jun 4 2025 4:39 PM

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి

హత్నూర(సంగారెడ్డి): ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. హత్నూర మండలం దౌల్తాబాద్‌ చౌరస్తాలో మంగళవారం కార్యకర్తలు ఏర్పాటు చేసిన మాజీమంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే కేక్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ...హరీశ్‌రావు నిత్యం ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలులో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వంపై విమర్శించడం తప్ప కాంగ్రెస్‌ నాయకులకు పనేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని భూభారతి ద్వారా భూ సమస్యలను వెంటనే 100% పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు, నాయకులు రవికుమార్‌, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

హత్నూర మండలం గుండ్ల మాచనూర్‌ పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బేగరి సాయిలు ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని సునీతారెడ్డి పరామర్శించి ఓదార్చారు. మండల కేంద్రంమైన హత్నూరలోని మాజీ జెడ్పీటీసీ ఆశయ్య అనే గ్రామపంచాయతీ కార్మికుడు గుండెపోటుతో ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement