రైతు మహోత్సవానికి రారండీ.. | - | Sakshi
Sakshi News home page

రైతు మహోత్సవానికి రారండీ..

Jun 5 2025 7:38 AM | Updated on Jun 5 2025 7:38 AM

రైతు

రైతు మహోత్సవానికి రారండీ..

రేపటి నుంచి హుస్నాబాద్‌లో కిసాన్‌ మేళా
● వ్యవసాయ మార్కెట్‌ యార్డులో భారీ ఏర్పాట్లు ● ఆధునిక వ్యవసాయ పరికరాలు, విత్తనాలపై అవగాహన ● మేళాను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● హాజరు కానున్న మంత్రులు పొన్నం, ఉత్తమ్‌, పొంగులేటి, కొండా సురేఖ ● వేలాదిగా తరలిరానున్న రైతులు

హుస్నాబాద్‌: రైతు మహోత్సవం సందర్భంగా కిసాన్‌ మేళాను హుస్నాబాద్‌ పట్టణంలో పెద్ద ఎత్తు న నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 6, 7, 8వ తేదీల్లో వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మేళా నిర్వహించనున్నారు. వివిధ రకాల వ్య వసాయ యంత్రాలపై అవగాహన కోసం స్టాళ్లను ఏర్పాటు చేశారు. మొదటి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు కలిసి మేళాను ప్రారంభించనున్నారు. వీరితో పాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మెదక్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు హాజరుకానున్నారు.

108 స్టాళ్లు..

కిసాన్‌ మేళాలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖ విభాగాలు, బ్యాంకులు, ఎఫ్‌పీఓలు, స్టార్టప్‌ కంపెనీలు, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రైవేట్‌ కంపెనీలకు సంబంధించిన 108 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయ పరికరాలు, డ్రోన్లు, రోబొటిక్‌ యంత్రాలు, సేంద్రియ ఎరువులు, ఫెస్టిసైడ్‌, హార్టికల్చర్‌, సెరికల్చర్‌, ఆయిల్‌పామ్‌, వివిధ రకాల పంటల విత్తనాలను ప్రదర్శిస్తారు. కొత్త పద్ధతులు, సాగు ఖర్చు తగ్గించే విధానాలు, వివిధ పంటలల్లో అధిక దిగుబడులకు పాటించాల్సిన మెలకువలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. అలాగే అభ్యుదయ రైతుల సక్సెస్‌ స్టోరీలను వివరించనున్నారు.

10వేల మంది రైతుల తరలింపు

కిసాన్‌ మేళా కార్యక్రమానికి జిల్లా నుంచి 10 వేల మంది రైతులను తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. 6న హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి, 7న సిద్దిపేట, చేర్యాల డివిజన్ల నుంచి, 8న దుబ్బాక, గజ్వేల్‌, ములుగు డివిజన్ల నుంచి రైతులను కిసాన్‌ మేళాకు తరలించనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

సద్వినియోగం చేసుకోండి

మూడు రోజుల పాటు జరిగే కిసాన్‌ మేళా కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వివిధ రకాల విత్తనాలు, ఆధునిక పరికరాల ప్రదర్శన ఉంటుంది. రోజూ వివిధ శాఖల అధికారులతో వర్క్‌షాపుతోపాటు శాస్త్రవేత్తల ద్వారా ముఖాముఖి నిర్వహిస్తున్నాం. ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తాం. రైతులను తరలించడానికి ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాం.

– రాధిక, జిల్లా వ్యవసాయ అధికారి

రైతు మహోత్సవానికి రారండీ.. 1
1/1

రైతు మహోత్సవానికి రారండీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement