
మానవ అక్రమ రవాణా నేరం
మెదక్ కలెక్టరేట్: మానవ అక్రమ రవాణా అతిపెద్ద నేరమని డీఈఓ రాధాకిషన్ అన్నారు. బుధవారం మెదక్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మనుషుల అక్రమ రవాణాను అరికట్టే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ మహిళలను కిడ్నాప్ చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. ఈ విషయంలో ప్రతి మహిళ అప్రమత్తంగా ఉండాలని, తోటి మహిళలను సైతం అక్రమ రవాణాపై అవగాహన కల్పించాలన్నారు. హైదరాబాద్కు చెందిన ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో మహిళలకు లఘు చిత్రం ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. మొబైల్, ఇంటర్నెట్ ద్వారానే అధికంగా ట్రాఫికింగ్కు గురవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు, జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన 58 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డీఈఓ రాధాకిషన్