మెదక్‌ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు | - | Sakshi
Sakshi News home page

మెదక్‌ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు

Jun 5 2025 7:38 AM | Updated on Jun 5 2025 7:38 AM

మెదక్

మెదక్‌ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్‌ జిల్లా ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాసరావును మెదక్‌కు బదిలీ చేశారు. రాష్ట్రంలో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీనివాసరావు 2013 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. మెదక్‌ ఎస్పీగా పనిచేసిన ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇటీవల పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఒకటి రెండు రోజుల్లో డీవీ శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.

ప్రభుత్వ బడుల్లోనే

నాణ్యమైన విద్య

టేక్మాల్‌(మెదక్‌): ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్యా బోధన అందుతుందని, ప్రభుత్వ బడులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పద్మారావు అన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో బడిబాట ప్రచార జాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజులతో నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులందరూ పిల్లలను చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో విద్యార్థుల పెంపునకు సహకరించాలని కోరారు.

గంజాయి విక్రయిస్తున్న

వ్యక్తి అరెస్ట్‌

మనోహరాబాద్‌(తూప్రాన్‌): గంజాయి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు నర్సాపూర్‌ ఎకై ్సజ్‌ అధికారులు బుధవారం తెలిపారు. ఈసందర్భంగా ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ గులాం ముస్తాఫా మాట్లాడుతూ.. మండలంలోని ముప్పిరెడ్డిపల్లిలో బీహార్‌కు చెందిన ఆదియ రాజు నివాసముంటున్నాడు. కాగా అతడు గంజాయి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు దాడి చేయగా అతని వద్ద నుంచి 221 గ్రాముల ఎండు గంజాయి లభించిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.

కూలీలకు గిట్టుబాటు అయ్యేలా చూడండి

కౌడిపల్లి(నర్సాపూర్‌): కూలీలకు గిట్టుబాటు అయ్యే విధంగా కొలతల ప్రకారం ఉపాధి పనులు చేయాలని డీఆర్‌డీఓ శ్రీనివాస్‌ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని మహమ్మద్‌నగర్‌లో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు కూలీ రూ. 300 వచ్చేలా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేయాలన్నారు. పని జరిగే చోట ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేయాలని ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం ఉచితంగా పాంపండ్స్‌ నిర్మిస్తుందని తెలిపారు. కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు.

భూ సమస్యల

పరిష్కారానికి చర్యలు

తూప్రాన్‌: భూ భారతి ద్వారా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వట్టూరు పడాలపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పర్యవేక్షించారు. ఈ గ్రామాల్లో 67 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో ఎక్కువగా సాదా బైనామాలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ సమస్యను రెవెన్యూ సదస్సు ద్వారా దరఖాస్తు చేసుకుంటే, వివిధ స్థాయిలలో పరిష్కారం అవుతాయని తెలిపారు.

మెదక్‌ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు 1
1/3

మెదక్‌ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు

మెదక్‌ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు 2
2/3

మెదక్‌ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు

మెదక్‌ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు 3
3/3

మెదక్‌ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement