
ఇక గ్రామాలే విత్తన బ్యాంకులు
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: రైతుల సంక్షేమమే ప్రధానంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇక నుంచి గ్రామాలే విత్తన బ్యాంకులుగా పనిచేస్తాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని రైతువేదికలో మంగళవారం అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తన బస్తాలను ఆయన పంపిణీ చేశారు. అంతకుముందు ఝరాసంగం ఆలయకమిటీ నూతన బోర్డుసభ్యులుగా నియమితులైన ఈశ్వరప్పను ఖేడ్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి సన్మానించారు. అనంతరం బాణాపూర్ గ్రామంలో భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ... గతప్రభుత్వం విత్తనాలు, వ్యవసాయ పనిముట్లపై రాయితీని ఎత్తివేసి రైతులపై భారం మోపిందన్నారు. ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసి గ్రామస్థాయిల్లోనే విత్తన బ్యాంకులు ఏర్పాటు జరిగేలా శ్రీకారం చుట్టిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరిట లక్షలాదిమంది రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపింఆరు. అన్యాయాన్ని సరిద్దిడానికి భూ భారతి చట్టం తీసుకువచ్చి రైతుల భూసమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చేందకు పక్కా ఇండ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. అనంతరం బాణాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఏ నూతన్ కుమార్, ఏవో శంకర్, నాయకులు రమేశ్చౌహన్, తాహెర్ అలీ, పండరీరెడ్డి, శంకర్ ముదిరాజ్, నెహ్రూనాయక్, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.