
ప్రగతి పరుగులు..
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025
● సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు ● అవతరణ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు
మెదక్ కలెక్టరేట్: తెలంగాణను దేశంలోనే అగ్రస్థాన ంలో నిలిపేందుకు ప్రభుత్వం తెలంగాణ రైజింగ్– 2047 విజన్తో ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు అన్నారు. రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమ వారం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి, ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలను సీఎం రేవంత్రెడ్డి ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో ప్రకటించారని తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు భగవధ్గీత లాంటిదని, ఇది రాష్ట్ర రూపురేఖలను మార్చేస్తుందని చెప్పారు. ఈసందర్భంగా జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల తీరును వివరించారు. ఆయన మాటల్లోనే..
14,796 మందికి ఆపరేషన్లు
జిల్లాలో ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజీ మంజురు చేసి తరగతులు ప్రారంభించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలో 14,796 మంది పేదలు చికిత్సలు పొందగా, ఇందుకు గాను ప్రభుత్వం రూ. 38.04 కోట్లు ఖర్చు చేసింది.
13 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 2,16,716 కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా ఇప్పటివరకు 13,922 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేశాం. జిల్లాకు 3,800 కొత్త రేషన్ కార్డులు మంజురయ్యాయి. యాసంగిలో కొనుగోలు కేంద్రాల ద్వారా 2,95,703 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 70,815 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి, వారి ఖాతాల్లో రూ. 573,60 కోట్లు జమ చేశాం.
రూ. 5 కోట్లతో బడుల నిర్వహణ
ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా 96.87 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 12వ స్థానంలో నిలవడం అభినందనీయం. జిల్లాలోని 904 పాఠశాలల నిర్వహణకు సుమారు రూ. 5 కోట్లు ఖర్చు కేటాయించాం. సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీల కింద ప్రభుత్వం 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సమీకృత గురుకులాన్ని రూ. 200 కోట్లతో నిర్మించనున్నాం.
34 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
జిల్లాలో వన మహోత్సవం ద్వారా 34 లక్షల మొ క్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించాం. శాంతిభద్రతల పరిరక్షణ, మత్తు పదార్థాలు, సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, హౌసింగ్ పీడీ మాణిక్యం,జిల్లా వ్యవసాయ అధికారి వినయ్తో కలిసి రైతులకు, విత్తనాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో అధికా రులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
న్యూస్రీల్
సంక్షేమ పథకాలకు పెద్దపీట
మహాలక్ష్మి (ఉచిత బస్సు సౌకర్యం) పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు మహిళలకు రూ. 69 కోట్ల లబ్ధి చేకూరింది. మహిళలంతా కలిసి 2. 38 కోట్ల ప్రయాణాలు ఉచితంగా చేశారు. గృహజ్యోతి కింద జిల్లాలో ఇప్పటివరకు 1,29,500 మంది వినియోగదారులకు జీరో బిల్లులు జారీ చేశాం. రూ. 54 కోట్ల 24 లక్షల సబ్సిడీని ప్రభుత్వం డిస్కంలకు చెల్లించింది. సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా జిల్లాలో 1,26,658 వినియోగదారులకు 4,68,195 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీపై అందుకున్నారు. వీరికి రూ. 13.18 కోట్ల మేర లబ్ధి జరిగింది. రైతు రుణమాఫీ పథకం ద్వారా 87,491 మంది రైతన్నలకు రూ. 645 కోట్లు రుణమాఫీ జరిగింది. రైతు భరోసా పథకం కింద మొత్తం 2,26,970 మంది రైతుల ఖాతాల్లో రూ.140, 70 కోట్లు జమయ్యాయి. పంట నష్టపో యిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేల ఆర్ధిక సహాయం అందుతోంది. అలాగే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు అందజేస్తున్నాం. గిరిజనుల భూములకు సాగునీరు, విద్యుత్ సౌకర్యం అందుతోంది. అలాగే జిల్లాలో ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు ప్రతి రెవెన్యూ గ్రామంలో సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు.

ప్రగతి పరుగులు..

ప్రగతి పరుగులు..

ప్రగతి పరుగులు..

ప్రగతి పరుగులు..