
మెతుకుసీమపై ప్రత్యేక ముద్ర
హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్జోన్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే 2024 జూలైలో మెదక్ జిల్లాకు ఎస్పీగా బదిలీపై వచ్చారు. ఉదయ్కుమార్కు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. నెలకోసారి సొంత గ్రా మంలోని పొలాలను సందర్శిస్తారు. ఆ మక్కువతోనే జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం చుట్టూ 60 ఎకరాలకు ఫెన్సింగ్ వేయించి అందులో రకరకాల మొక్కలు నాటి పెంచుతున్నారు. ఇప్పటివరకు 1,000 మొక్కలు నాటించి వాటికి డ్రిప్ ఇరిగేషన్ వేయించారు. అలాగే జిల్లాలో ఫైరింగ్ రేంజ్ను, జిల్లా పోలీస్ కార్యాలయ పరిధిలోనే సిబ్బందికి అవసరమయ్యే పరేడ్ ఏర్పాటు చేయించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నూతనంగా మెదక్ టౌన్లో ట్రాఫిక్ వింగ్ను కొత్తగా ఏర్పాటు చేశారు. జిల్లాలో పనిచేసే పోలీసులు, హోంగార్డ్ సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి పోస్టల్ ఎన్ఐసీని తీసుకునే విధంగా చొరవ చూ పారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత గ్రామం రామచంద్రాపురంలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు.