
టీచర్లు విధిగా శిక్షణకు హాజరుకావాలి
నర్సాపూర్/నర్సాపూర్ రూరల్: ఉపాధ్యాయుల శిక్షణను విజయవంతం చేయాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. సోమవారం ఎంఆర్సీ భవనంలో ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడారు. ఈనెల 20 నుంచి 25 వరకు ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. మండల స్థాయిలో ఎస్జీటీలకు, జిల్లాస్థాయిలో స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయని చెప్పారు. కాగా ఉపాధ్యాయులు విధిగా శిక్షణలో పాల్గొనాలని సూచించారు. సమావేశంలో ఎంఈఓ తారాసింగ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం అచ్చంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో వేసవి శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. హెచ్ఎం లక్ష్మీనారాయణ సొంత నిధులతో వేసవి శిబిరం ప్రారంభించి శిక్షణ ఇప్పించడం అభినందనీయమని కొనియాడారు.
డీఈఓ రాధాకిషన్