ధాన్యం తరలింపులో విఫలం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తరలింపులో విఫలం

May 20 2025 7:35 AM | Updated on May 20 2025 7:35 AM

ధాన్యం తరలింపులో విఫలం

ధాన్యం తరలింపులో విఫలం

శివ్వంపేట(నర్సాపూర్‌): కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. సోమవారం శివ్వంపేటలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యం సకాలంలో తూకం వేసి తరలించకపోవడంతో ఎండిన వడ్లు సైతం తడుస్తున్నాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే కొనుగోళ్లలో వేగం పెంచాలన్నారు. ఇప్పటివరకు సన్నరకం ధాన్యానికి సంబంధించి రైతులకు రూ. 500 బోనస్‌ ఇవ్వలేదన్నారు. లారీలు, హమాలీల కొరత ఉందని, అందుకనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్రాల్లో నుంచి ధాన్యం తరలింపు ఇబ్బందులు గురించి సివిల్‌ సప్లై డీఎంతో మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమణాగౌడ్‌, నాయకులు మన్సూర్‌, వెంకట్‌రెడ్డి, లక్ష్మీనర్సయ్య, శ్రీనివాస్‌గుప్తా, మహేందర్‌రెడ్డి, కల్లూరి రాజు, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement