కనుల పండువగా బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా బ్రహ్మోత్సవాలు

May 11 2025 12:38 PM | Updated on May 11 2025 12:38 PM

కనుల పండువగా బ్రహ్మోత్సవాలు

కనుల పండువగా బ్రహ్మోత్సవాలు

శివ్వంపేట(నర్సాపూర్‌): మండల పరిధిలోని దొంతి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి ఆలయ పూజారి గోపాలకృష్ణ ప్రత్యేక పూజల నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రధాన వీధుల గుండా పల్లకిసేవ ఊరేగింపు చేపట్టారు. భక్తులు హారతులు ఇచ్చి పూజలు చేపట్టారు.

నేడు విద్యుత్‌ సరాఫరాలో అంతరాయం

చిన్నశంకరంపేట(మెదక్‌): చిన్నశంకరంపేట మండలం సూరారం, భగిరథపల్లిలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరాఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ దినకర్‌, ఏడీఈ మోహన్‌బాబు తెలిపారు. లైన్‌ల మరమ్మతులలో భాగంగా సబ్‌స్టేషన్‌ మరమ్మతులు, చెట్ల నరికివేత నిర్వహిస్తున్నందున విద్యుత్‌ సరాఫరాకు అంతరాయం ఏర్పడనుందన్నారు. విద్యుత్‌ వినియోగదారులుఫీ విషయం గమనించి సహకరించాలని ఆయన కోరారు.

కెమికల్‌ పరిశ్రమలో చోరీ

తూప్రాన్‌: పట్టణ పరిధిలోని రావెల్లి సమీపంలోని ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో చోరీ జరిగింది. ఎస్‌ఐ శివానందం కథనం ప్రకారం.. గ్రామ సమీపంలోని సంక్షేన్‌ కెమికల్‌ పరిశ్రమలో ఈనెల 7న విలువైన సామగ్రితో పాటు రూ. లక్ష విలువైన వ్యవసాయ పనిముట్లను ఆటోలో అపహరించుకెళ్లినట్లు పరిశ్రమ సెక్యూరిటీ గార్డు వెంకటేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement