
చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం
హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులు చదువులతోనే కాకుడా క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపి ఉన్నత స్థాయిలో రాణించాలని మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్రెడ్డి అన్నారు. శనివారం మెదక్ మండల పరిధిలోని మక్తభూపతిపూర్లో క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని అన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు మొబైల్ ఫోన్లలో చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలపై దృష్టి సారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. క్రీడాకారులతో కరచాలనం చేసిన సీఐ టోర్నీని ప్రారంభించారు. ఈ టోర్నీలో పాల్గొంటున్న క్రీడాకారులకు మల్లేశం సహకారంతో అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు, ఘట్టయ్య, అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గట్టాగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ కొమ్ము పవన్, మాజీ వార్డు సభ్యుడు గట్టయ్య, నిర్వాహకులు మహమ్మద్ ఖుర్షీద్, బక్కన్నగారి శ్రీహరి, రవీందర్, ప్రభాకర్, దుర్గారాములు తదితరుల ఉన్నారు.
మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి