మత్తు పదార్థాలపై గిరిజనులకు అవగాహన | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలపై గిరిజనులకు అవగాహన

May 11 2025 12:38 PM | Updated on May 11 2025 12:38 PM

మత్తు పదార్థాలపై గిరిజనులకు అవగాహన

మత్తు పదార్థాలపై గిరిజనులకు అవగాహన

నర్సాపూర్‌: మత్తు పదార్థాలపై గిరిజనులకు అవగాహన కల్పించినట్లు స్థానిక ఇన్‌చార్జి ఎకై ్సజ్‌ సీఐ గోపాల్‌ చెప్పారు. శనివారం ఉదయం నర్సాపూర్‌ సంగారెడ్డి మార్గంలో పలు వాహనాలు తనిఖీ చేశామని తెలిపారు. అనంతరం మండలంలోని సూర్యతండా, హరియా తండా, మాడాపూర్‌ తండాలకు చెందిన గిరిజనులకు పలు అంశాలపై అవగాహన కల్పించామని చెప్పారు. నాటుసారా తయారు చేయడం, గంజాయి, డ్రగ్స్‌, కల్లులో కలిపే మత్తు పధార్థాలు కల్గి ఉండటం అమ్మడం నేరమని వారికి అవగాహన కల్పించామని, ఎవరైనా వాటిని అమ్మినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాంటి వారి సమాచారం రహస్యంగా ఉంచుతామని వారికి వివరించినట్లు గోపాల్‌ చెప్పారు. తనతో పాటు తమ సిబ్బంది పాల్గొన్నారని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement