
భూ సమస్యలకుసత్వర పరిష్కారం
కలెక్టర్ రాహుల్రాజ్
చిలప్చెడ్(నర్సాపూర్): భూ సమస్యలు ఉన్న రైతులకు భూ భారతి చట్టంతో మేలు జరుగుతుందని, సత్వరమే పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపికై న చిలప్చెడ్ మండలంలోని గంగారం, శేరి ఫైజాబాద్ గ్రామాల్లో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. రైతుల భూసమస్యల గురించి అడిగి తెలుసుకొని, వారికి పలు సూచనలు ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలున్న ప్రతి ఒక్కరూ రూపాయి ఖర్చు లేకుండా, ఉచితంగా రెవె న్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సరైన ఆధారాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు. సత్వరమే పరిష్కారమయ్యే సమస్యలు తహసీల్దార్ పరిధిలోనే, కీలకంగా ఉన్న సమస్యలు 80 శాతం వరకు ఆర్డీఓ స్థాయిలో పరిష్కారమవుతాయని తెలిపారు. మరీ కీలకంగా ఉంటే కలెక్టర్ స్థాయిలో పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. ధరణిలో పరిష్కారం కాని ప్రతి సమస్యకు భూ భారతిలో ఆప్షన్ ఉందన్నారు. మండలంలో ఈనెల 14 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు
వేగవంతం చేయండి
రామాయంపేట(మెదక్): ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని మెదక్ ఆర్డీవో రమాదేవి ఆదేశించారు. గురువారం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షాలు కురుస్తున్నందున తూకం వేసిన వెంటనే ధాన్యం బస్తాలు రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం బస్తాలు లోడ్ చేసిన అనంతరం విధిగా టాల్పాలిన్ కప్పిన తర్వాతే పంపించాలని ఆదేశించారు. లారీలో రైస్ మిల్లులకు చేరిన ఆరు గంటల్లోపే అన్లోడ్ చేయించాలని, కేంద్రాల్లో సక్రమంగా రికార్డులు రాయాలని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ రజనికుమారి, సహకార సంఘాల సీఈఓలు పాల్గొన్నారు.
ఐకేపీ సిబ్బందికి అవార్డు
శివ్వంపేట(నర్సాపూర్): బ్యాంకు లింకేజీ ద్వారా లక్ష్యానికి మించి రుణాలు ఇప్పించినందుకు గాను మండలంలోని గూడూర్ గ్రామానికి చెందిన ఐకేపీ సిబ్బంది అవార్డు అందుకున్నారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో వీఓ సుజాత, వీఏఓ చోటేబిలకు మంత్రి సీతక్క అవార్డు అందజేశారు. జిల్లాస్థాయిలో స్థానిక ఇండియన్ బ్యాంకు ద్వారా 210 శాతం మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించినందుకు గాను అవార్డు వరించినట్లు ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వర్లు తెలిపారు.
తడిసిన ధాన్యం కొంటాం
చేగుంట(తూప్రాన్): ఈనెల 15లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం చేగుంట తహసీల్దార్ కార్యాలయంలో కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తడిసిన ధా న్యం సైతం కొనుగోలు చేయాలని నిర్ణయించినందున రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. సహకార సంఘాల సీఈఓలు కొనుగోలు కేంద్రాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ స్వప్న, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

భూ సమస్యలకుసత్వర పరిష్కారం

భూ సమస్యలకుసత్వర పరిష్కారం