
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు
● ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయ్రెడ్డినివాసంపై దాడిని ఖండించినజర్నలిస్టులు ● ఉమ్మడి జిల్లాలో వెల్లువెత్తిన నిరసనలు
మెదక్జోన్: ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయ్రెడ్డి నివాసంపై ఏపీ పోలీసుల దాడిని నిరసిస్తూ గురువారం ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా పలు చోట్ల జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఏపీ పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో పలు యూనియన్ల నాయకులు, వివిధ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతిపత్రం అందజేశారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నీలం, నాగరాజు, భువన్, రాణి, సంగమేశ్వర్, కృష్ణమూర్తి నిరసన తెలిపి కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం ఇచ్చారు. అలాగే నర్సాపూర్లో జర్నలిస్టు సంఘాల నాయకులు జి. భిక్షపతి, వెంకటే ష్, సుధాకర్, శ్రీనివాస్, అశోక్రెడ్డి, శ్రీశైలం, బబ్బురి సుధాకర్, శ్రీనివాస్, ప్రసాద్గౌడ్, వినోద్ నిరసన తెలిపి ఆర్డీఓ మహిపాల్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాపన్నపేటలో టీయూడబ్యూజే రాష్ట్ర నాయకులు మిన్పూర్ శ్రీనివాస్, పాపన్నపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోహన్రాజ్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, మాజీ అధ్యక్షులు బాల్కిషన్, సత్యనారాయణ, శివచరణ్ సింగ్ తహసీల్దార్ సతీష్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎడిటర్ నివాసంలోకి చొరబడటం అప్రజాస్వా మికమన్నారు. ప్రజాస్వామ్య వాదులందరూ ఈ చర్యను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. శివ్వంపేటలో ప్రెస్క్లబ్ మండల అధ్యక్షుడు బొడ్డు రవి ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు మల్లేష్, ప్రధాన కార్యదర్శి పోచగౌడ్, ఉపాధ్యక్షుడు నట్రాజ్గౌడ్, ముఖ్య సలహాదారుడు బాలేష్ తదితరులు నిరసన తెలిపి ఆర్ఐ కిషన్కు వినతిపత్రం అందజేశారు. కౌడిపల్లిలో ప్రెస్క్లబ్ ప్రతినిధులు మల్లేశ్, కుమార్, రవిగౌడ్, సుభాష్గౌడ్, శేఖర్గౌడ్, శరత్, ప్రశాంత్, పెంటయ్య తదితరులు డిప్యూటీ తహసీల్దార్ జహీర్కు వినతిపత్రం అందజేశారు.

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు