
పార్టీ సంస్థాగత బలోపేతానికి చర్యలు
నర్సాపూర్: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం చర్యలు తీసుకుందని పార్టీ జిల్లా పరిశీలకుడు, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్ తెలిపారు. శనివారం నర్సాపూర్లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర పీసీసీ వరకు కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు జాతీయ నాయకత్వం చర్యలు తీసుకుందని వివరించారు. కాగా పార్టీ పదవులకు పలువురు నాయకులు తమ నామినేషన్లను అందజేశారు. యువజన కాంగ్రెస్ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్