అర్హుల గుర్తింపు త్వరగా చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

అర్హుల గుర్తింపు త్వరగా చేపట్టండి

May 3 2025 8:45 AM | Updated on May 3 2025 8:45 AM

అర్హుల గుర్తింపు త్వరగా చేపట్టండి

అర్హుల గుర్తింపు త్వరగా చేపట్టండి

మెదక్‌ కలెక్టరేట్‌: ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన ప్రక్రి యను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ నగేష్‌తో కలిసి అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సర్వే పూర్తి కావొచ్చిందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మిగిలిన వాటి పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి, సత్వరమే పూర్తిచేయాలన్నారు. అర్హులను మాత్రమే గుర్తించాలని సూచించారు. అలాగే జిల్లాలో రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలన్నారు.

5 నుంచి రెవెన్యూ సదస్సులు

ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ నగేష్‌, డీఆర్‌ఓ భుజంగరావు, ఏఎస్పీ మహేందర్‌, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలోని ఒక మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకొని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పారు. భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. జూన్‌ 2 వరకు పైలెట్‌ ప్రాజెక్టు కింద వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని చెప్పారు. అలాగే ఈనెల 4న జరుగనున్న నీట్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం జిల్లాలో ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. మండుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement