
ఐక్యంగా హక్కులు సాధించుకోవాలి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి
కౌడిపల్లి(నర్సాపూర్): భవన నిర్మాణ రంగాల కార్మికులు ఐక్యతగా ఉండి హక్కులను సాధించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి తెలిపారు. గురువారం మేడే సందర్భంగా కౌడిపల్లి లో భవన నిర్మాణ కార్మికులు నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించి పతాకావిష్కరణ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికులు చట్టాలను తెలుసుకొని హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. పనికి తగిన వేతనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈసందర్భంగా నూతన భవనం వద్ద నీటి సమస్యను తీర్చేందుకు బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, సిమెంట్ డీలర్లు నవీన్, భూమయ్య, విఠల్, సంఘం అధ్యక్షుడు వెంకటే శ్వరరావు, ప్రశాంత్, శ్రీనివాస్, నాసర్ఖాన్, సురేష్, బాలకృష్ణ, శ్యాంకుమార్ పాల్గొన్నారు.