
అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్రాజ్ పరిశీలించారు. పతాకావిష్కరణకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు రానున్న నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, తాగునీరు తదితరాలపై పలు సూచనలు చేశారు. పోలీసుల గౌరవ వందనం, బందోబస్తుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓ రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్, కలెక్టరేట్ ఏఓ యూనస్, ఇతర అధికారులు సిబ్బంది ఉన్నారు. – మెదక్ కలెక్టరేట్

అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం