విలేజ్‌లోనే విత్తనోత్పత్తి | - | Sakshi
Sakshi News home page

విలేజ్‌లోనే విత్తనోత్పత్తి

Jun 2 2025 7:37 AM | Updated on Jun 2 2025 7:37 AM

విలేజ

విలేజ్‌లోనే విత్తనోత్పత్తి

విత్తనాల సాగుకు రైతుల ఎంపిక
● జిల్లాలో 1,173 మందికి అవకాశం ● నేటి నుంచి నాణ్యమైన సీడ్స్‌ పంపిణీకి ఏర్పాట్లు

ప్రైవేట్‌ కంపెనీలపై ఆధారపడకుండా రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకోసం గ్రామాల వారీగా రైతులను ఎంపిక చేసింది. వారికి కావాల్సిన నాణ్యమైన విత్తన సీడ్‌ను 95 శాతం సబ్సిడీపై అందించడానికి కసరత్తు చేస్తుంది. సోమవారం అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో గల రైతు వేదికల ద్వారా విత్తనాలను అందించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

– మెదక్‌ కలెక్టరేట్‌

రి, పెసర విత్తనోత్పత్తి వంగడాలు పండించేందుకు క్లస్టర్ల వారీగా వ్యవసాయశాఖ అధికారులు రైతులను ఎంపిక చేశారు. జిల్లాలో 21 మండలాలు 391 క్లస్టర్‌ గ్రామాలు ఉండగా.. అన్ని మండలాల్లో గ్రామానికి ముగ్గురు చొప్పున మొత్తం 1,173 మంది రైతులను గుర్తించారు. ఇందులో వరి విత్తనోత్పత్తి సాగుకు 782 మంది, పెసరకు 402 మందిని ఎంపిక చేశారు. వీరికి అవతరణ దినోత్సవం సందర్భంగా రైతు వేదికల ద్వారా విత్తనాలను అందించేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎంపికై న రైతులకు 10 కిలోల వరి విత్తన బస్తా కేవలం రూ. 50కే అందజేస్తున్నారు. అలాగే 3 కిలోల పెసర విత్తన బస్తాను సైతం రూ. 50కే ఇస్తున్నారు. విత్తనాలను ఉచితంగా ఇస్తే రైతులకు ఆసక్తి ఉండదన్న ఉద్దేశంతో మొక్కుబడి చార్జి వేసినట్లు సంబంధిత వ్యవసాయ అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ విత్తనాలను సాగు చేసిన రైతులు పంట ఉత్పత్తి జరిగిన అనంతరం గ్రామంలోని తోటి రైతులకు అందజేయాల్సి ఉంటుంది. ఇలా రైతులు తమకు కావాల్సిన విత్తనాలను వారే సొంతంగా పండించుకునే కార్యాచరణను ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటికే జిల్లాకు వరి, పెసర విత్తన సీడ్స్‌ను సరఫరా చేసింది.

శాస్త్రవేత్తల పరిశీలన

విత్తనాల నారు సిద్ధం కాగానే జిల్లాకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు వాటిని పరిశీలిస్తారు. నాటు ఎలా వేయాలి, ఎంతమేర మందులు వాడాలి, నీరు ఏ మోతాదులో అందించాలి, కలుపు తీసే విధానం, సస్యరక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు అందజేసి పంట పూర్తయ్యే వరకు పరిశీలిస్తారు. రైతులు అత్యధిక దిగుబడులు సాధించేలా మెలకువలు అందిస్తారు.

కల్తీ విత్తనాలకు చెక్‌

కల్తీ విత్తనాలతో ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వాటిని తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులే సొంతంగా సీడ్‌ విత్తనాలను పండించడంతో తిప్పలు తప్పనున్నాయి. ఈ విత్తనోత్పత్తి అంతకంతకు పెరిగితే కల్తీ విత్తనాలు విక్రయించే మోసగాళ్లకు చెక్‌ పెట్టవచ్చు.

రైతులకు లాభసాటి

రైతులు సొంతంగా విత్తనాలను పండించుకోవడంతో విత్తనాల కోసం కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అలాగే రైతులకు నకిలీ విత్తనాల బెడద ఉండదు. నాణ్యమైన విత్తనాలు సొంత గ్రామంలో లభించడంతో రైతులకు మంచి లాభాసాటిగా ఉంటుంది. భవిష్యత్‌లో గ్రామాలే విత్తన కేంద్రాలుగా ఏర్పడనున్నాయి. అలాగే నాణ్యమైన విత్తనాలు కావడంతో అధిక దిగుబడుల సాఽధించి ఆర్థికాభివృద్ధి పొందవచ్చు.

– వినయ్‌, జిల్లా వ్యవసాయ అధికారి

విలేజ్‌లోనే విత్తనోత్పత్తి 1
1/2

విలేజ్‌లోనే విత్తనోత్పత్తి

విలేజ్‌లోనే విత్తనోత్పత్తి 2
2/2

విలేజ్‌లోనే విత్తనోత్పత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement