
‘బడిబాట తర్వాతే టీచర్లను సర్దుబాటు చేయాలి’
మెదక్ కలెక్టరేట్: బడిబాట అనంతరం ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని పీఆర్టీ యూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత డైస్ సంఖ్య ఆధారంగా ఈనెల 13 లోపు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. ఇది విద్యా వ్యవస్థను అయోమయానికి గురి చేస్తుందని తెలిపారు. బడిబాట కార్యక్రమం పూర్తయ్యే సరికి ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో 60 మందికి ఇద్దరే టీచర్లు, 90 మందికి ముగ్గురు టీచర్లు అని ఉత్తర్వులు ఇవ్వడం సమంజసమైన విధానం కాదన్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నప్పుడే నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
క్రీడా స్ఫూర్తితో
ముందుకు సాగాలి
చిన్నశంకరంపేట(మెదక్): క్రీడా స్ఫూర్తితో యువకులు ముందుకుసాగాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. ఆదివా రం మండలంలోని శాలిపేటలో క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హా జరై విజేతలకు నగదు బహుమతు లు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువకులు క్రీడల ద్వారా మానసికోల్లాసం, శారీరక ధారుడ్యం పెరుగుతుందన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, మాజీ వైస్ ఎంపీపీ సత్యంగౌడ్, మాజీ సర్పంచ్ పోచయ్య, నాయకులు శ్రీనివాస్రెడ్డి, యాదగిరి, శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం అన్లోడ్ చేయడం లేదని ఆందోళన
శివ్వంపేట(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాల నుంచి రైస్మిల్కు తీసుకొచ్చిన దొడ్డురకం ధాన్యం 10 రోజులు అవుతున్నా అన్లోడింగ్ చేయడం లేదని డ్రైవర్లు, రైతులు అదివారం అందోళన చేశారు. మండల పరిధి దొంతిలోని మీనాక్షి రైస్మిల్కు వివిధ ప్రాంతాల కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లోడుతో లారీలు, ట్రాక్టర్లు వచ్చాయి. రైస్మిల్ యాజమాన్యం దొడ్డు రకం ధాన్యం అన్లోడింగ్ చేయకుండా సన్నాలను ముందుగా అన్లోడింగ్ చేస్తున్నారని వాపోయారు. సీరియల్ ప్రకా రం ధాన్యం అన్లోడింగ్ చేయాలని డిమాండ్ చేశారు.
రోడ్డు పనులు త్వరగా
పూర్తి చేయించండి
శివ్వంపేట(నర్సాపూర్): అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనులు పూర్తి చేయించేందు కు చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందర్రావును మండల బీజేపీ నాయకులు కో రారు. అదివారం హైదరాబాద్లోని నివాసంలో ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. చండీ నుంచి అనంతారం చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కొండల్రావు, వెంకట్రెడ్డి, భి క్షపతి, మ ల్లేష్, అశోక్, ఆంజనేయులుచారి ఉన్నారు.

‘బడిబాట తర్వాతే టీచర్లను సర్దుబాటు చేయాలి’