
వారంలో కొనుగోళ్లు పూర్తి
కలెక్టర్ రాహుల్రాజ్
ఉత్తమ సేవలకు గుర్తింపు
అదనపు ఎస్పీతో పాటు మరో 8 మందికి పతకాలు
బోనం.. వైభవం
కొల్చారం(నర్సాపూర్): వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపడతామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని పోతంశెట్టిపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో జిల్లాలోని రైతులందరికీ నిర్దేశించిన మద్దతు కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 2,95,703 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇందుకు సంబంధించి రైతులకు రూ. 573.60 కోట్లు చెల్లించినట్లు వివరించారు. ఇందులో సుమారు 12,872 మంది రైతుల నుంచి 53,659 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొను గోలు చేసి క్వింటాల్కు రూ. 500 బోనస్ చొప్పు న మొత్తం రూ. 26.83 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు చివరి దశలో ఉన్నాయని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఉన్నారు.
మెదక్ మున్సిపాలిటీ: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులకు సేవా పతకాలను ప్రకటించింది. అదనపు ఎస్పీ మహేందర్ మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. అలాగే జిల్లాకు చెందిన మరో 8 మందికి పతకాలు వరించాయి. ఉత్తమ సేవా పతకానికి యశ్వంతరావు (మెదక్ ఆర్ఎస్ఐ), గాలయ్య (ఏఎస్ఐ పాపన్నపేట), కే.ఎన్.మూర్తి (ఏఎస్ఐ మనోహరాబాద్), మోహన్ (ఏఆర్ఎస్ఐ మెదక్), రాములు (హెడ్ కానిస్టేబుల్, డీఎస్బీ మెదక్), వైద్యనాథ్ (ఏఆర్హెచ్సీ మెదక్), బస్వరాజ్ (ఏఆర్హెచ్ఈ మెదక్), రాజు (కానిస్టేబుల్, చేగుంట) ఉత్తమ పతకాలకు ఎంపికయ్యారు. వీరంతా నేడు పతకాలు అందుకోనున్నారు.
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో ఆదివారం మున్నూరుకాపు కులస్తుల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డులకు చెందిన మహిళలు ఆటోనగర్లో గల నల్లపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఎమ్మెల్యే రోహిత్రావు ఉత్సవాలకు హాజరై బోనమెత్తారు. శివసత్తుల సిగాలు, పోతరాజులు, యువకుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డితో పాటు మున్నూరుకాపు సంఘం నాయకులు, మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

వారంలో కొనుగోళ్లు పూర్తి