
ప్రభుత్వ కళాశాలలో చేరండి
రామాయంపేట(మెదక్): ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు గ్రామాల బాట పట్టారు. గురువారం మండలంలోని కోనాపూర్లో అడ్మిషన్ డ్రైవ్ చేపట్టారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ కళాశాలలో చేరాలని అవగాహన కల్పించారు. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని, ఉచితంగా పుస్తకాలు, ఉపకార వేతనాలు, ఉచిత బస్పాస్ సదుపాయం అమలులో ఉంటుందని వివరించారు. పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి ప్రైవేట్ కళాశాలల్లో చేరవద్దని సూచించారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు అంగీకరించారు.