
రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు
చిన్నశంకరంపేట(మెదక్): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని మెదక్ ఆర్డీఓ రమాదేవి హెచ్చరించారు. మంగళవారం చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట, శాలిపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించి రిజిస్టర్లు తనిఖీ చేశారు. అలాగే శాలిపేటలోని రైస్మిల్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తేమ శాతం పరిశీలించి ధాన్యాన్ని వెనువెంటనే కాంటాలు వేయాలన్నారు. కాంటా అయిన తరువాత రైస్మిల్లుకు తరలించాలని సూచించారు. రైస్మిల్లర్లు లోడింగ్, అన్లోడింగ్ విషయంలో నిబంధనలు పాటించాలన్నారు. ఆమె వెంట చిన్నశంకరంపేట తహసీల్దార్ మన్నన్ ఉన్నారు. నార్సింగి మండల కేంద్రంలోని రైస్మిల్లులను ఆర్ఐ మేఘనగౌడ్ తనిఖీ చేశారు.
ట్రాక్టర్లతో ధాన్యం తరలిస్తే అద్దె చెల్లిస్తాం
చేగుంట(తూప్రాన్): లారీల కొరత ఉన్నందున ట్రాక్టర్లలో ధాన్యం తరలిస్తే అద్దె చెల్లిస్తామని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. మండలంలోని కర్నాల్పల్లి చిన్న శివునూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన రికార్డులు, నాణ్యత పరీక్షల వివరాలు, చెల్లింపుల వివరాలపై ఆరా తీశారు. ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించాలని ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, కేంద్రాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మెదక్ ఆర్డీఓ రమాదేవి