కొమురవెల్లి నూతన ఈఓగా అన్నపూర్ణ | - | Sakshi
Sakshi News home page

కొమురవెల్లి నూతన ఈఓగా అన్నపూర్ణ

Apr 8 2025 7:09 AM | Updated on Apr 8 2025 7:09 AM

కొమురవెల్లి నూతన ఈఓగా అన్నపూర్ణ

కొమురవెల్లి నూతన ఈఓగా అన్నపూర్ణ

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఈఓగా అన్నపూర్ణ బాధ్యతలు స్వీకరించారు. అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామాంజనేయులును దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి దేవాస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ అన్నపూర్ణకు మల్లన్న ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు అన్నపూర్ణ సోమవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఏఈఓ బుద్ధి శ్రీనివాస్‌, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్‌ రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement