నస్పూర్: నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజురుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు కృషి చేస్తున్నారని నగర మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. శనివారం ఆయన డిప్యూటీ మేయర్ సల్ల రమ్యతో కలిసి 24వ డివిజన్లోని సింగపూర్ ఆర్అండ్ఆర్ కాలనీలో అట్కపురం తిరుమల, రాజేశం ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొడ్డు స్వప్న, సిబ్బంది శీపతి సురేష్, నాయకులు బొడ్డు తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.


