క్యాతనపల్లిలో ఎన్నికలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

క్యాతనపల్లిలో ఎన్నికలు నిర్వహించాలి

Mar 26 2026 7:34 AM | Updated on Mar 26 2026 7:34 AM

● ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి

● ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి

రామకృష్ణాపూర్‌: హైకోర్టు తీర్పును అనుసరించి క్యాతనపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్‌ చేశారు. బెయిల్‌ షరతుల్లో భాగంగా బుధవారం ఆమె రామకృష్ణాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు హాజరై సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికను రెండుసార్లు వాయిదా వేయడం సరికాదని, ప్రజల తీర్పును గౌరవించి ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌, రామిడి కుమార్‌, తిరుపతిరెడ్డి, మద్ది శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement