ఓటు హక్కు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు వినియోగించుకోవాలి

Dec 17 2025 7:21 AM | Updated on Dec 17 2025 7:21 AM

ఓటు హక్కు వినియోగించుకోవాలి

ఓటు హక్కు వినియోగించుకోవాలి

చెన్నూర్‌రూరల్‌: ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు విని యోగించుకోవాల ని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్‌, పోలింగ్‌ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మూడవ విడత సర్పంచ్‌ ఎన్నికలలో భాగంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెన్నూర్‌ పట్టణ సీఐ దేవేందర్‌రావు పాల్గొన్నారు.

భద్రత మధ్య ఎన్నికలు

భీమారం: భద్రత మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నతపాఠశాల వద్ద ఏర్పాటు చేసి న ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. మండలంలోని ఆన్ని గ్రామ పంచాయతీ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఐలు నవీన్‌, అశోక్‌, ఎస్సై శ్వేత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement