జల సంరక్షణలో భేష్‌ | - | Sakshi
Sakshi News home page

జల సంరక్షణలో భేష్‌

Nov 15 2025 7:41 AM | Updated on Nov 15 2025 7:41 AM

జల సంరక్షణలో భేష్‌

జల సంరక్షణలో భేష్‌

● నీటిబొట్టును ఒడిసిపట్టారు.. ● జాతీయ, రాష్ట్ర స్థాయిలో మూడోస్థానం ● 18న అవార్డు అందుకోన్ను కలెక్టర్‌

పాతమంచిర్యాల: పరుగెత్తే నీటిని నడిపించాలి.. నడిచే నీటిని ఆపాలి.. ఆగిన నీటిని భూమిలో ఇంకింపజేయాలి అనే నినాదంతో జిల్లాలో చేపట్టిన జల సంరక్షణ పనులతో జిల్లాకు పేరొచ్చింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా నిర్వహించిన పనులకు గాను జిల్లా అవార్డుకు ఎంపికై ంది. నీటి సంరక్షణ పనులు సమర్థవంతంగా చేపట్టి దేశంలో, రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించారు. నీటి నిల్వల పెంపునకు రాళ్లకట్టలు, ఊటకుంటలు, చెక్‌డ్యాంలు, ఇంకుడుగుంతలు తదితర నిర్మాణ పనులు జిల్లా వ్యాప్తంగా 85,076 చేపట్టారు. 80శాతం పనుల వివరాలను డీఆర్డీఏ అధికారులు జల్‌ సించాయి జల్‌ భాగీధారి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. గత జూలైలో భూగర్భ జల శాస్త్రజ్ఞుల బృందం సభ్యుడు కే.రాంబాబు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర జలశక్తి అభియాన్‌ అధికారులకు నివేదిక పంపించారు. క్షేత్రస్థాయిలో పనులు, జల్‌ సించాయి జల్‌ భాగీధారిలో నిక్షిప్తమైన పనులను సరిపోల్చుకుని కేంద్ర జలశక్తి అధికారులు జిల్లాను అవార్డుకు ఎంపిక చేశారు. దీంతో జిల్లాకు కేంద్ర ప్రభుత్వ అవార్డు రూ.2కోట్ల నగదు అందనుందని డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. 18న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్‌.కిషన్‌ అవార్డును అందుకోనున్నారు.

మండలాల వారీగా పనులు

కోటపల్లి 6434

జైపూర్‌ 5580

భీమారం 5692

తాండూర్‌ 5306

చెన్నూర్‌ 4920

నెన్నెల 5066

దండేపల్లి 6335

జన్నారం 6218

కాసిపేట 6115

భీమిని 5762

వేమనపల్లి 5096

లక్సెట్టిపేట 4090

హాజీపూర్‌ 4231

బెల్లంపల్లి 4207

మందమర్రి 4388

కన్నెపల్లి 5723

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement