పెండింగ్‌ కేసుల్లో రాజీకి చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసుల్లో రాజీకి చర్యలు తీసుకోవాలి

Nov 4 2025 7:20 AM | Updated on Nov 4 2025 7:20 AM

పెండింగ్‌ కేసుల్లో రాజీకి చర్యలు తీసుకోవాలి

పెండింగ్‌ కేసుల్లో రాజీకి చర్యలు తీసుకోవాలి

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య ● ప్రత్యేక లోక్‌ అదాలత్‌పై సమీక్ష

మంచిర్యాలక్రైం: ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ ఏ.వీరయ్య సూచించారు. ఈ నెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్‌ అదాలత్‌పై సోమవారం కోర్టు ప్రాంగణంలో పోలీసు అధికారులతో సమీక్షించారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు రాజీమార్గమే రాజమార్గమనే ఉద్దేశంతో ఉన్నత న్యాయస్థానం ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహణకు అవకాశం కల్పించిందని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా న్యాయమూర్తి లాల్‌సింగ్‌ శ్రీనివాస్‌నాయక్‌, డీసీపీ ఎగ్గడి భాస్కర్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.నిర్మల, అదనపు సినియర్‌ సివిల్‌ జడ్జి డి.రామ్మోహన్‌రెడ్డి, రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కే.నిరోష, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు భుజంగరావ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement