విడిచి ఉండలేక‘పోయారు’! | - | Sakshi
Sakshi News home page

విడిచి ఉండలేక‘పోయారు’!

Oct 16 2025 5:05 AM | Updated on Oct 16 2025 5:05 AM

విడిచి ఉండలేక‘పోయారు’!

విడిచి ఉండలేక‘పోయారు’!

జ్వరంతో బాలుడు మృత్యువాత

బర్త్‌డే రోజు శీతలపానీయంలో పురుగులమందు తాగి తల్లిదండ్రులు, సోదరి ఆత్మహత్యాయత్నం

చికిత్స పొందుతూ ఒక్కొక్కరిగా మృతి

రెండు నెలల వ్యవధిలో నలుగురు..

మంచిర్యాలక్రైం: చిన్న కుటుంబం.. భార్యాభర్తలు.. ఇద్దరు పిల్లలు.. జీవితం ఆనందంతో సాగిపోతోంది. ఒక్కగానొక్క కుమారుడు.. ఒకే కూతురు కావడంతో కంటికి రెప్పలా చూసుకున్నారు. వారిద్దరే సర్వస్వమని ఏ లోటూ రాకుండా పెంచసాగారు. వారి ఆనందమయ జీవనంపై విధి చిన్నచూపు చూసింది. కుమారుడిని జ్వరమై మృత్యువు కబళించింది. అతడిని విడిచి ఉండలేక తల్లిదండ్రులు, సోదరి ఆత్మహత్యాయత్నం చేసి ఒక్కొక్కరిగా ముగ్గురూ మృత్యువాతపడ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా విషాదం మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన బండి చక్రవర్తి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య దివ్య, కుమారుడు పవన్‌, కూతురు దీక్షిత ఉన్నారు. రెండు నెలల క్రితం పవన్‌(12) జ్వరంతో మృతిచెందాడు. ఈ సంఘటన కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేసింది. తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ నెల 5న పవన్‌ బర్త్‌డే కావడంతో కేక్‌, కూల్‌డ్రింక్‌ తెచ్చుకుని ఏర్పాట్లు చేశారు. గడ్డిమందు, పురుగుల మందు కూల్‌డ్రింక్స్‌లో కలుపుకొని ముగ్గురూ తాగారు. విషయం తెలిసిన చక్రవర్తి తమ్ముడు బండి ఓంకార్‌ వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఈ నెల 8న దీక్షిత(10), వరంగల్‌ ఎంజీఎంలో 11న దివ్య(29), బుధవారం చక్రవర్తి(32) చనిపోయారు. పవన్‌ను విడిచి ఉండలేక ముగ్గురూ మృతిచెందడం స్థానికంగా విషాదం నింపింది. ఓంకార్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement