ఎరువులు పంపిణీ చేయాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఎరువులు పంపిణీ చేయాలని ధర్నా

Jul 18 2025 1:35 PM | Updated on Jul 18 2025 1:35 PM

ఎరువులు పంపిణీ చేయాలని ధర్నా

ఎరువులు పంపిణీ చేయాలని ధర్నా

కోటపల్లి: రైతులకు సరిపడా ఎరువుల బస్తాలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం కోటపల్లిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజారమేష్‌ మాట్లాడుతూ ఎరువుల కోసం రైతులు ఆధార్‌కార్డులు, చెప్పులు వరుసలో ఉంచి నాలుగైదు రోజులు పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. సకాలంలో ఎరువులు ఇవ్వలేని మంత్రి వివేక్‌ రాజీనామా చేయాలని అన్నారు. ఎస్సై రాజేందర్‌ ఆందోళనను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ సాంబగౌడ్‌, యూత్‌ అధ్యక్షుడు విద్యాసాగర్‌, మాజీ జెడ్పీటీసీ తిరుపతి, మాజీ ఎంపీపీ బాపు, మాజీ సర్పంచ్‌ కృష్ణ, మాజీ కౌన్సిలర్‌ రెవెల్లి మహేశ్‌, నాయకులు స్వామి, భారతి, చిరంజీవి, నాయబ్‌, సంపత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement