ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ధర్నా

May 31 2025 1:24 AM | Updated on May 31 2025 1:24 AM

ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ధర్నా

ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ధర్నా

మంచిర్యాలఅగ్రికల్చర్‌: సింగరేణి స్థలాల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న వారికి శాశ్వత పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, నాయకుడు రఘునాథ్‌ వెరబెల్లి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి సింగరేణి స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇంటి పన్నులు చెల్లిస్తున్న పేదలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు, బాధితులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement