● ఎమ్మెల్యేలు వినోద్, వివేక్, బొజ్జు పటేల్
బెల్లంపల్లి: దేవాపూర్ ఓరి యంట్ సిమెంటు కంపెనీ(ఓసీసీ) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ పక్షాన ఆదివాసీ సంఘాలు బలపరుస్తున్న అభ్యర్థిగా పుస్కూరి విక్రమ్రావును పోటీలో నిలబెడుతున్నట్లు బెల్లంపల్లి, చెన్నూర్, ఖానాపూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్, గడ్డం వివేక్, వెడ్మ బొజ్జు పటేల్ ప్రకటించారు. శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఐఎన్టీయూసీ పోటీలో ఉండబోతోందని అన్నారు. విక్రమ్రావు విజయం కోసం కాంగ్రెస్, ఐఎన్టీయూసీ శ్రేణులు పాటుపడాలని కోరారు. కాకా వెంకటస్వామి కు టుంబం ఆది నుంచి కార్మిక పక్షపాతిగా పని చేస్తోందని అన్నారు. కాకా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న తాము కూడా కార్మిక హక్కుల కోసం పాటుపడుతున్నామని ఎమ్మెల్యేలు వినోద్, వివేక్ తెలిపారు. ఆదివాసీలు, ఆదివాసీ సంఘాలు అనాది నుంచి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తెలిపారు. నమ్మకానికి ప్రతిరూపమైన ఆదివాసీ లను వంచించవద్దని సూచించా రు. ఆదివాసీలు కలిసికట్టుగా విక్రమ్రావు విజయానికి దోహదపడాలని కోరారు. విక్రమ్రావు మాట్లాడుతూ తనను ఎన్నికల్లో గెలిపిస్తే కార్మికులకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మునిమంద రమేష్, దావ రమేష్, కంకటి శ్రీనివాస్, కేవీ ప్రతాప్, రత్నం ప్రదీప్, ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఖాతాల్లో నగదు జమ
మంచిర్యాలఅగ్రికల్చర్: వరిధాన్యం సేకరించిన రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.271 కోట్లు జమ చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 25,280 మంది రైతుల నుంచి 1,77,465 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. నిత్యం 4 వేల నుంచి 8 వేల టన్నుల ధాన్యం కాంటా చేసి 358 లారీల్లో 6 వేల నుంచి 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలోని మిల్లులతోపాటు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని 130 మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. అకాల వర్షాల సమయంలో కేంద్రాల్లో అందుబాటులో ఉన్న టార్పాలిన్లు వినియోగించుకోవాలని సూచించారు.