అర్హులకే రాజీవ్‌ యువ వికాసం రుణాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులకే రాజీవ్‌ యువ వికాసం రుణాలు

May 31 2025 1:22 AM | Updated on May 31 2025 1:22 AM

అర్హులకే రాజీవ్‌ యువ వికాసం రుణాలు

అర్హులకే రాజీవ్‌ యువ వికాసం రుణాలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి

భీమారం/జైపూర్‌: ప్రభుత్వం అర్హులైన వారికే రాజీవ్‌ యువ వికాసం రుణాలు అందజేస్తుందని చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. శుక్రవారం ఆయన భీమారం మండల కేంద్రంలోని రైతువేదికలో రాజీవ్‌ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. జైపూర్‌ మండలం షెట్‌పల్లిలో మండలంలోని 588మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజీవ్‌ యువ వికాసం పథకంలో తన ప్రమేయం కూడా ఏమాత్రం ఉండదని, దరఖాస్తు చేసుకున్న వారి సిబిల్‌ స్కోర్‌తోపాటు పలు అంశాలు పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని, మొదటి విడతలో మంజూరు కాని నిరుపేదలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైపూర్‌ తహసీల్దార్‌ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతిబాపురావు, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు చల్ల సత్యనారాయణరెడ్డి, అన్నం వెంకటన్న, కిరణ్‌గౌడ్‌, విశ్వంభర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పోలీసు భద్రత పెంపు

భీమారం పర్యటన కోసం వచ్చిన ఎమ్మెల్యే వివేక్‌కు ఈసారి ఎప్పుడూ లేనివిధంగా భద్రత పెంచారు. జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రావు నేతృత్వంలో శ్రీరాంపూర్‌ సీఐ వేణుచందర్‌, భీమారం, జైపూర్‌ ఎస్సైలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement