
సమస్యలు పరిష్కరిస్తాం..
● మా పరిధిలోనివి మూడు రోజుల్లోనే.. ● మిగతావి ఎమ్మెల్యే, ఉన్నతాధికారుల దృష్టికి ● మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణ ప్ర జలు విన్నవించిన సమస్యల్లో తమ పరిఽ దిలో ఉన్న వాటిని రెండు మూడు రోజు ల్లోనే పరిష్కరిస్తానని, తమ పరిధిలో లేని వాటిని స్థానిక ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరి ష్కారానికి కృషి చేస్తానని మందమర్రి ము న్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు అన్నారు. మందమర్రి మున్సిపాల్టీలోని స మస్యలపై శుక్రవారం ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో కమిషనర్తో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పట్టణ ప్రజలు పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మొదటిజోన్ కమ్యూనిటీ హాల్ వెనుక కల్వ ర్టులో పందుల సమస్య విపరీతంగా ఉంది. కల్వర్టు ఏర్పాటు చేసి పందుల సమస్య పరిష్కరించాలి. – మైకేల్, మొదటిజోన్
కమిషనర్: ఆ ఏరియాకు అధికారులు వచ్చి పరిశీలించి సమస్య పరిష్కరిస్తారు. సింగరేణి పరిధిలో ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం అందించి పరిష్కారానికి కృషి చేస్తాం.
దీపక్నగర్లోని ప్రభాకర్రావు లైన్ మాంటిస్సారి స్కూల్ ఏరియాలో 2017లో సిమెంటు రోడ్డు వేసినప్పుడు సుమారు కిలోమీటరు వరకు మిగిలింది. మిగతా రోడ్డు ఇప్పటికీ వేయలేదు. రోడ్డు పూర్తిగా వేయాలి. ధ్వంసమైన చోట మరమ్మతులు చేయాలి. 11వ వార్డులో పోచమ్మగుడి సమీపంలో కల్వర్టుపై రంధ్రాలు పడి ఇబ్బంది ఉంది. వాటిని మూసివేయాలి.
– గుంట రాకేష్, సంతోష్, అనిల్, అశోక్, దీపక్నగర్, నందిపాటి రాజ్కుమార్,
రాజశేఖర్, 11వ వార్డు
కమిషనర్: సంబంధిత ఇంజినీరు మీ వద్దకు వచ్చి సమస్య పరిశీలిస్తారు. అవసరమైతే నిధులు కేటాయించి రోడ్డు వేయిస్తాం. కల్వర్టుపై రంధ్రాలు మూసివేయిస్తాం.
పాతబస్టాండ్ ఏరియాలోని బ్రిడ్జి కింద వీధి దీపాలు లేక రాత్రి సమయంలో ప్రజలు, వాహనదారులకు ఇబ్బందిగా ఉంటుంది. వీధి దీపాలు అమర్చగలరు. పిల్లర్ల కింద చెత్త పోగు చేసిన సంచులు లేకుండా చూడాలి.
– బోరిగం వెంకటేష్, పాత బస్టాండ్ ఏరియా
కమిషనర్: వీధి దీపాలు అమరుస్తాం. పిల్ల ర్ల కింద చెత్త బ్యాగులు లేకుండా అధికారులతో నిఘా ఏర్పాటు చేస్తాం.
తాగునీరు క్లోరినేషన్ చేయకుండా కాలనీల్లో సరఫరా చేస్తున్నారు. వాసనతోపాటు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. రైల్వేస్టేషన్ రోడ్డు పక్కన కాలువలు నిర్మించాలి. కాలనీల్లో పిచ్చిమొక్కలు తొలగించాలి. పాతబస్టాండ్ నుంచి రామన్ కాలనీ వరకు డ్రెయినేజీ నిర్మాణం ఎత్తువంపులుగా ఉంది. మురుగు నీరు నిలువకుండా సరి చేయగలరు.
– సోమయ్య, దీపక్నగర్, శంకర్,
శ్రీపతినగర్, సదయ్య, 19వ వార్డు
కమిషనర్: క్లోరినేషన్ తర్వాతనే తాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది. మీ స మస్య పరిశీలించి క్లోరినేషన్ తర్వాతనే నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటాం. రెండు మూడు రోజుల్లో పిచ్చిమొక్కలు తొలగి స్తాం. ఏరియాను పరిశీలించి కాలువలు ని ర్మిస్తాం. డ్రెయినేజీ నిర్మాణం సమస్యపై కాంట్రాక్టర్కు తెలియజేశాం. సరిచేస్తాం.

సమస్యలు పరిష్కరిస్తాం..