బాసరలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

బాసరలో భక్తుల రద్దీ

Jun 3 2025 12:15 AM | Updated on Jun 3 2025 12:15 AM

బాసరల

బాసరలో భక్తుల రద్దీ

బాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ద ర్శించుకునేందుకు సోమవారం తెలంగాణ, ఆ ంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివచ్చారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆల య అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు. 1000 రూపాయల అభ్యాసం టికెట్లు 280, 150 అక్షరాభ్యాసం టికెట్లు 425, వివిధ ఆర్జిత సేవల టికెట్ల ద్వారా ఆలయానికి రూ.8.25 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

కొనసాగుతున్న క్రికెట్‌ ఎంపిక పోటీలు

మంచిర్యాలటౌన్‌: ఆదిలాబాద్‌ జిల్లా క్రికెట్‌ అ సోసియేషన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేష న్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా క్రికెట్‌ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటీలు కొనసాగుతున్నాయి. సోమవారం గుడిపే ట్‌ బెటాలియన్‌లో గ్రీన్‌, యెల్లో జట్లకు పోటీలు నిర్వహించగా మొదటి ఇన్నింగ్స్‌లో గ్రీన్‌ జ ట్టు 328 పరుగులు, యెల్లో జట్టు 274 పరుగులు సాధించాయి. రెండో ఇన్నింగ్స్‌లో యెల్లో జ ట్టు 158 పరుగులు, గ్రీన్‌ జట్టు 274 పరుగులు సాధించగా, గ్రీన్‌ జట్టు విజయం సాధించినట్లు కోచ్‌ ప్రదీప్‌ తెలిపారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా జి.చరణ్‌, బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా అవినాశ్‌ జాదవ్‌, బెస్ట్‌ బౌలర్‌గా అనిరుధ్‌ నిలిచారు.

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

మంచిర్యాలఅర్బన్‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్‌ రమేష్‌ తెలిపారు. పది, ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఐటీఐలో ప్రవేశం పొందేందుకు ఆగస్టు 1, 2024 నాటికి 14సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. మొదటి దఫా అడ్మిషన్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ దాఖలు ఈ నెల 2నుంచి 21 వరకు ఉంటుందని తెలిపారు. అన్ని ఒరిజినల్‌ సర్టిఫికేట్లు స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. పూర్తి వివరాలకు ఆయా ఐటీఐలో సంప్రదించాలని సూచించారు.

తెలంగాణలో సింగరేణి కీలకం

మందమర్రిరూరల్‌: తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థ కీలకమని చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం మందమర్రి ఏరియా జీఎం దేవేందర్‌ ఆధ్వర్యంలో సింగరేణి హైస్కూల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కొత్త బొగ్గు బావులు వస్తేనే సింగరేణికి భవిష్యత్‌ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏరియా జీఎం దేవేందర్‌, ఎస్వో టూ జీఎం విజయ్‌ప్రసాద్‌, పర్సనల్‌ మేనేజర్‌ శ్యాంసుందర్‌ ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్‌ కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

బాసరలో భక్తుల రద్దీ1
1/1

బాసరలో భక్తుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement