
వాగు దాటాలంటే కష్టమే..
మందమర్రిరూరల్: మందమర్రి మండల కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని శంకర్పల్లి గ్రామానికి వెళ్లేదారిలో పాలవాగుపై వంతెన లేక వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. వరద నీటి ప్రవాహంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది. గతేడాది శంకర్పల్లికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో వరద రావడంతో వాగును దాటడానికి ప్రయత్నించి ఇద్దరు వ్యక్తులు కొంతదూరం కొట్టుకుపోగా గ్రామస్తులు కాపాడారు. పాలవాగుపై వంతెన నిర్మించాలని గ్రామప్రజలు అనేకసార్లు ఎమ్మెల్యే, అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కరించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.