
వలస పక్షులపై పరిశీలన
లక్సెట్టిపేట: మండలంలోని వెంకట్రావుపేట గ్రామ శివారు చెరువులోకి వలస వస్తున్న పక్షులను పీసీసీఎఫ్ ఏలూరు సింగ్మేరు, ఎఫ్డీపీటీ శాంతారాం బుధవారం పరిశీలించారు. ఇతర దేశాల నుంచి ప్రతీ సంవత్సరం వలస వస్తున్న పక్షుల వివరాలు, చెరువు అభివృద్ధి, పక్షుల ప్రాముఖ్యత తెలుసుకున్నారు. వలస పక్షుల ఉనికి, వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. బైనాక్యులర్ ద్వారా పక్షులను పరిశీలించి ఫొటోలు తీశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్సింగ్, ఎఫ్డీవో సర్వేశ్వర్, ఎఫ్ఆర్వో సుభాష్, సిబ్బంది పాల్గొన్నారు.