
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
● కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా పంచాయతీరాజ్, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, జిల్లా పరిషత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. నిర్మాణ దశలు పూర్తయిన మేరకు బిల్లులు సమర్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీర్ రామ్మోహన్రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జెడ్పీ సీవో గణపతి, ఏఈఈలు పాల్గొన్నారు.
విద్యార్థుల ప్రతిభ అభినందనీయం
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ జిల్లా పరిషత్ విభాగంలో జన్నారం మండలం కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులు అ త్యధిక మార్కులు సాధించడం అభినందనీయమ ని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో ఉత్తమ మార్కులు సాధించిన వి ద్యార్థులు రాథోడ్ యోగేశ్వర్(582), ఏల్పుల నరేందర్(570), కొత్త అనిల్(560)లను శాలువాలతో స త్కరించారు. ఎన్ఎంఎంఎస్ ఫలితాల్లో జిల్లాలో మొదటి స్థానం, జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితా లు సాధించడంలో పాఠశాల ప్రధానోపాధ్యాయు డు గుండ రాజన్న, ఉపాధ్యాయ బృందం కృషి ఎంతో ఉందన్నారు. సెక్టోరియల్ అధికారులు సత్యనా యణమూర్తి, చౌదరి, శ్రీనివాస్రావు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి భూభారతి
జైపూర్/చెన్నూర్రూరల్: క్షేతస్థాయిలో భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి అమలు చేస్తోందని, అనేక ఏళ్లుగా పరిష్కారం కాని వాటిని పరిష్కరిస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జైపూర్ మండలం నర్సింగాపూర్, మిట్టపల్లి, చెన్నూర్ మండలం బుద్ధారం గ్రామాల్లో నిర్వహించిన రెవన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మండలాల్లో ఈ నెల 20వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. బుద్ధారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వంటశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. చెన్నూర్లో అమృత్ 2.0 పనులను కమిషనర్ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జైపూర్ తహసీల్దార్ వనజారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్కుమార్, చెన్నూర్ తహసీల్దార్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.