
రెవెన్యూ సదస్సులో రైతుల గొడవ
బెల్లంపల్లిరూరల్: మండలంలోని చంద్రవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఇద్దరు రైతుల మధ్య గొడవ జరిగింది. చంద్రవెల్లి శివారులోని సర్వే నంబరు 300/7/1లో నాలుగెకరాల భూమి విషయంలో గ్రామానికి చెందిన పూదరి రమేష్, బుధాకుర్థు గ్రామ పంచాయతీకి చెందిన మైల రాజ్కుమార్ మధ్య విభేదాలు తలెత్తాయి. భూమి పట్టా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇద్దరూ సదస్సుకు వచ్చారు. దరఖాస్తు అందజేసే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగి ఘర్షణకు దిగారు. తహసీల్దార్ కృష్ణ ఎదుటే ఘటన జరగడంతో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు గొడవ సద్దుమణిగేలా చేశారు. భూమి విషయమై ఇద్దరి మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నట్లు సమాచారం. రైతుల గొడవ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాళ్లగురిజాల ఎస్సై రమేష్ అక్కడికి చేరుకుని ఇరువురిని పంపించి వేశారు. అనంతరం తాళ్లగురిజాల పోలీసుస్టేషన్లో ఒకరిపైనొకరు ఫిర్యాదు చేసుకోగా.. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలి పారు. కాగా, గొడవకు, రెవెన్యూ శాఖకు సంబంధం లేదని తహసీల్దార్ కృష్ణ తెలిపారు. వ్యక్తిగతంగా గొడవ జరిగిందని, గొడవకు కారణమైన ఇద్దరి పై పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.

రెవెన్యూ సదస్సులో రైతుల గొడవ