
ఎస్టీపీపీలో సింగరేణి ఎస్సీ లైజన్ అధికారుల పర్యటన
జైపూర్: స్థానిక సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో ఎస్సీ లైజన్ అధికారుల బృందం శుక్రవారం పర్యటించింది. సింగరేణి ఎస్సీ చీఫ్ లైజన్ ఆఫీసర్, మణుగూర్ జీఎం రామచందర్కు ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులు స్వాగతం పలి కారు. అనంతరం అడ్మిన్ భవన కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఉద్యోగాల నియామకాలు, పదో న్నతుల్లో పాలసీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్(ఆర్వోఆర్) అమలు చేయాలని ఆదేశించారు. ఎస్టీపీపీలో ఎస్సీ ఉద్యోగుల వివరాలు అధికారులకు వివరించా రు. ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేశ్వర్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్రావు, జనల్ సెక్రెటరీ నాగేశ్వర్రావు, జాయింట్ సెక్రెటరీ తిరుపతి, ఎస్టీపీపీ ఎస్సీ లైజన్ ఆఫీసర్ పులి సురేశ్, డీజీఎంలు ఆజాజుల్లాఖాన్, అజ్మీరాతుకారాం, తదితరులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు సీసీ
కెమెరాల తోడ్పాటు
జైపూర్: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పడుతాయని, అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారులు, నాయకులు సహకరించాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ అన్నారు. మండలంలోని టేకుమట్ల గ్రామంలో కమ్యూనిటీ పోలీస్, నేను సైతంలో భాగంగా ఏ ర్పాటు చేసిన 14సీసీ కెమెరాలను శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా రాత్రింబవళ్లు నిఘా ఉంటుందని, గ్రామంలో ఎ లాంటి సంఘటనలు చోటుచేసున్నా తక్షణమే గు ర్తించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు.

ఎస్టీపీపీలో సింగరేణి ఎస్సీ లైజన్ అధికారుల పర్యటన