
దరఖాస్తుల స్వీకరణ
మంచిర్యాలటౌన్: తెలంగాణ వైద్య విధానపరిషత్, జిల్లా ప్రధాన పర్యవేక్షణ అధికారి పరిధిలోని లక్సెట్టిపేట సామాజిక ఆస్పత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్ సమకూర్చేందుకు డీపీసీఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షకులు డాక్టర్ ఎం.కోటేశ్వర్ తెలిపారు. వివరాలను జిల్లా అధికారిక వెబ్సైట్లో https://mancheria l.telangana.gov.in పొందుపర్చినట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల ఏజెన్సీల ప్రతినిధులు ఈనెల 13వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా ప్రధాన ఆస్పత్రుల పర్యవేక్షణ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
యోగాసన జడ్జి శిక్షణ పొందిన రోహిత్
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన రేవెల్లి రోహిత్ పంజాబ్లోని పటియాలలో జరిగిన 5వ జాతీయస్థాయి యోగాసన జడ్జెస్ శిక్షణ పూర్తి చేసుకున్నట్లు జిల్లా యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మండ శ్రీనివాస్, అక్కల తిరుపతివర్మ తెలిపారు. నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో నిర్వహించిన శిక్షణను రోహిత్ పూర్తి చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.