వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

Jun 4 2025 12:08 AM | Updated on Jun 4 2025 12:08 AM

వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

మంచిర్యాలటౌన్‌: జిల్లాలో వంద రోజులపాటు ఇంటిగ్రేటెడ్‌ వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ హరీశ్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాతమంచిర్యాల అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయ న పరిశీలించి రోగులతో మాట్లాడారు. క్షయ నివారణ, హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ అసంక్రమణ వ్యాధులు, హైపటైటిస్‌ పరీక్షలు, ఆయా వ్యా ధులపై అవగాహన కల్పిస్తారని అన్నారు. నె లలో 16రోజులు నిర్వహించే వైద్య శిబిరాల ను వైద్యులు, సిబ్బంది, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు విజయవంతం చేయాలని తెలిపారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు ఏర్పాటు చేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధాకర్‌నాయక్‌, ప్రోగ్రాం ఆఫీ సర్‌ డాక్టర్‌ ప్రసాద్‌, వైద్యులు శివప్రతాప్‌, అమర్‌, రాము, రజిత, వెంకటేశ్వర్లు, మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement