
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం
మంచిర్యాలటౌన్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన పార్టీ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పర్యావరణం బాగుంటేనే దేశం బాగుంటుందని, రాబోవు తరాలకు మంచి వాతావరణంతో కూడుకున్న సమాజాన్ని అందించాలనే ఉద్దేశంతో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ జూన్ 5 నుంచి ఆగస్టు 15వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ నెల 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ గ్రామంలో యోగా డే కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సమావేశంలో నాయకులు దుర్గం అశోక్, తదితరులు పాల్గొన్నారు.