
నిర్ధారణతోనే క్షయ వ్యాధి నివారణ
మంచిర్యాలటౌన్: సత్వర వ్యాధి నిర్ధారణే క్షయవ్యాధి నివారణకు మార్గమని, తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలని జిల్లా క్షయ నివా రణ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని గొల్లవాడ కమ్యూనిటీ హాలులో ఇంటిగ్రేటెడ్ వైద్య శిబిరం గురువా రం నిర్వహించారు. వైద్యులు ప్రజలకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం డాక్టర్ సుధాకర్నాయక్ మాట్లాడుతూ రెండు వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయవ్యాధిగా అనుమానించాలని, జిల్లాలోని ప్రతీ ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. వ్యాధిగ్రస్తులకు ఉ చితంగా చికిత్సతోపాటు ప్రభుత్వం ప్రతీ నెల రూ.1000 చొప్పున పోషణ భత్యం అందజేస్తుందని అన్నారు. వైద్య శిబిరంలో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఎక్స్రే అవసరం ఉన్న వారిని 102 వాహనం ద్వారా మంచిర్యా ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. బీపీ, షుగర్తోపాటు ఇతర పరీక్షల కోసం 50 మంది నమూనాలను సేవకరించి టీహబ్కు పంపించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాము, ప్రత్యూష, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసాద్, డాక్టర్ శివప్రతాప్, సీహెచ్వో రామమూర్తి, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, క్షయ విభాగం జిల్లా కోఆర్డినేటర్ సురేందర్, సాయిరెడ్డి, స్వప్న, ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీలత పాల్గొన్నారు.