
శిక్షణ అంశాలను విద్యార్థులకు వివరించాలి
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు వివరించాలని డీఈవో యాదయ్య ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మూడు విడతలుగా బోధన నైపుణ్యాలపై శిక్షణ ముగిసింది. ఈ సందర్భంగా సాయికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ బోధన అభ్యసన పద్ధతులలోపాటు ఉపాధ్యాయులకు జీవన నైపుణ్యాలు, హ్యుమాన్ ట్రాఫికింగ్, సైబర్ ట్రాఫికింగ్, భరోసా, భవిత, హార్ట్ఫుల్నెస్ ద్వారా ధ్యానం ఇలా అనేక అంశాలపై శిక్షణ అందించినట్లు తెలిపారు. శిక్షణలో చురుగ్గా పాల్గొన్న నలుగురు శిక్షణార్థులను, శిక్షణ విజయవంతంగా నిర్వహించిన డీఆర్పీలను డీఈవో సన్మానించారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్ర ఇంచార్జీ వెంకటస్వామి పాల్గొన్నారు.