భవితకు భరోసా..! | - | Sakshi
Sakshi News home page

భవితకు భరోసా..!

May 30 2025 1:50 AM | Updated on May 30 2025 1:50 AM

భవితకు భరోసా..!

భవితకు భరోసా..!

● మౌలిక వసతులకు నిధులు ● ఉమ్మడి జిల్లాకు రూ.1.59 కోట్లు మంజూరు

మంచిర్యాలఅర్బన్‌: భవిత కేంద్రాలకు మహర్దశ పట్టనుంది. దివ్యాంగ పిల్లలకు భరోసానిచ్చే భవిత కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ర్యాంపులు, రైలింగ్‌తో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న భవనాలకు మరమ్మతులు, కార్యకలాపాల గది నిర్మాణం, పిల్లలకు అనుకూలమైన అభ్యాస వాతావరణం కోసం అవసరాలకు అనుగుణంగా ఆధారిత పెయింటింగ్‌కు నిధులు మంజూరు చేస్తూ తెలంగాణ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల్లో భవిత కేంద్రాలుండగా ఐదు చోట్ల మాత్రమే పక్కా భవనాలున్నాయి. మిగిలిన భవిత కేంద్రాలు పాఠశాల ఆవరణలో కొనసాగుతున్నాయి. 196 మంది ప్రత్యేక అవసరాలుగల పిల్లలుండగా ఒక్కో కేంద్రానికి ఇద్దరు ఐఈఆర్‌పీల చొప్పున 36 మందికిగానూ 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. 12 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. భవిత కేంద్రాల్లో చేపట్టే పనుల అంచనాలు రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. అదనపు నిధులు అవసరమైతే జస్టిఫికేషన్‌ నివేదికతో ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశాలొచ్చాయి.

కేంద్రాల బలోపేతానికి..

భవిత కేంద్రాల్లో 196 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులున్నారు. ఇందులో 92 మంది ఇంటివద్దే ఉంటూ తగిన సేవలు అందుకుంటున్న వా రున్నారు. మానసిక దివ్యాంగులు, చెవిటి, మూగ, అంధత్వం ఇలా 21 రకాలుగా పాఠశాలలకు వచ్చి న విద్యార్థులను గుర్తించి సేవలు అందిస్తున్నారు. వచ్చే ఎడాది నుంచి భవిత కేంద్రాల బలోపేతంపై కన్వర్జెన్స్‌లో దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు. నమోదును పెంచటం, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలందరినీ గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్చటానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యం నిర్ధారించడం, పిల్లలకు వ్యక్తిగత అవసరాల ఆధారంగా అవసరమైన చికిత్స జోక్యాలు, మద్దతు అందించటానికి ఫిజియోథెరపిస్టులు, స్పిచ్‌ థెరపిస్టులు క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. గతేడా ది భవిత కేంద్రాలకు అవసరమైన పరికరాలు కొ నుగోలు చేసేందుకు నిధులు కేటాయించగా, అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలని పొందుపర్చారు. ప్రతీ చిన్నారి విద్యాపరంగా, అభివృద్ధిలో పురోగతి సాధించటంపై దృష్టి కేంద్రీకరించా ల్సి ఉంటుంది. స్వయం సహాయక సంఘాల సహయంతో సీఎస్‌డబ్ల్యూయన్‌ గుర్తింపు వందశాతం కవ రేజీకి చేరుకోవాలని ఉత్తర్వుల్లో పొందుపర్చారు.

పక్కా భవనాలు ఎప్పుడో..?

ఉమ్మడి జిల్లాలో భవిత కేంద్రాలకు 17 చోట్ల పక్కా భవనాలున్నాయి. మిగిలిన 53 చోట్ల భవనాలులేక పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నారు. భవిత కేంద్రాలకు అవసరమైన మౌలిక వసతులకు నిధులు కేటాయించినా పక్కా భవనాల నిర్మాణం విస్మరించారు. తాండూర్‌, బెల్లంపల్లి, దండేపల్లి, మందమర్రి, కోటపల్లిలో మాత్రమే భవిత కేంద్రాలున్నాయి. మిగిలిన కేంద్రాల్లో సమస్యలు తిష్టవేశాయి. భవిత భవనాల నిర్మాణానికి స్థలగుర్తింపునకు ఎంఈవో లకు అప్పగించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా స్థల కేటాయింపు, నిధులు మంజూరు చేస్తేనే ప్ర త్యేక అవసరాల పిల్లలకు సౌకర్యంగా మారనుంది.

నిధుల ఖర్చు ఇలా..

ఉమ్మడి జిల్లా భవిత కేంద్రాల్లో చేపట్టే పనులకు నిధులు ఖర్చు చేయడంపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాకు రూ.1,59,57,764 నిధులు మంజూరయ్యాయి. ప్రాధాన్యత ప్రాతిపదికన అవసరాలను గుర్తించాలని కలెక్టర్‌కు సూచించారు. కార్యకలాపాల గది నిర్మాణానికి యూనిట్‌కు రూ.7 లక్షల వరకు, ర్యాంపు, రైలింగ్‌తో కూడిన యాక్సెస్‌ చేయగల టాయిలెట్‌ నిర్మాణానికి యూనిట్‌కు రూ.లక్ష, భవనాల మరమ్మతులకు రూ.లక్ష (అవసరం ప్రకారం), ఇప్పటికే ఉన్న టాయిలెట్ల మరమ్మతులకు రూ.50వేలు, పిల్లల అభ్యాస, అవసరాలకు అనుగుణంగా పెయింటింగ్‌కు రూ. 1.50 లక్షలు ఖర్చు చేయాలని నిబంధనలున్నాయి.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పక్కా భవనాలు, పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న భవనాలు,

మంజూరైన నిధులు ఇలా ఉన్నాయి.

జిల్లా పక్కా భవనాలు పాఠశాల ఆవరణలో మంజూరైన నిధులు

ఆదిలాబాద్‌ 4 14 రూ.42,24,114

కుమురంభీం 4 11 రూ.35,20,095

నిర్మల్‌ 4 15 రూ.44,58,787

మంచిర్యాల 5 13 రూ.37,54,768

మొత్తం 17 53 రూ.1,59,57,764

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement