
ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు తెలుగు, ఇంగ్లిషు, గణితం, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టుల మూల్యాంకనం చేశారు. మూల్యాంకనానికి నియమించిన 120మంది రిపోర్టు చేశారు. డీఐఈవో అంజయ్య పర్యవేక్షణలో మూల్యాంకనం కోసం సమన్వయ సమావేశం అసిస్టెంట్ ఆఫీసర్, చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, సబ్జెక్టు విషయ నిపుణులతో జరిగింది. స్పాట్ వాల్యూయేషన్పై అవగాహన కల్పించారు. మొదటి రోజు ఒక్కొక్కరికి 15 చొప్పున జవాబు పత్రాలు ఇచ్చినట్లు డీఐఈవో అంజయ్య తెలిపారు.